బీఆర్‌ఎస్‌తోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యం: MLA Challa Dharma Reddy

by Disha Web Desk 19 |
బీఆర్‌ఎస్‌తోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యం: MLA Challa Dharma Reddy
X

దిశ, హనుమకొండ టౌన్: దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కటక్షపూర్, హౌజ్ బుజుర్గ్, నీరుకుళ్ళ, పెంచికలపేట గ్రామాల ముఖ్య నాయకులతో శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలోనూ ఉన్నదని అన్నారు.

దేశంలో ఉన్న సంపద ప్రజలందరికీ అందాలనే దృఢ సంకల్పంతో బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతున్నదని తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ నడుంకట్టారని కొనియాడారు. బీజేపీ నాయకుల నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ప్యాషన్‌గా మారిందని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకుల కుట్రలను ప్రతి కార్యకర్త తిప్పి కొట్టాలన్నారు. గ్రామాలలో, వాడలలో బీజేపీ నాయకులు తిరుగుతూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నిలదీయాలన్నారు.

బీఆర్ఎస్‌లో చేరిన మాజీ సర్పంచ్..

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండి సాంబయ్య గులాబీ దళంలోకి చేరారు. వారిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. మండల ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు, యువ నాయకులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed