ప్రజల సంక్షేమం కోసం ప్రజాసేవలో కాంగ్రెస్ : పెరుమాండ్ల రామకృష్ణ

by Disha Web Desk 20 |
ప్రజల సంక్షేమం కోసం ప్రజాసేవలో కాంగ్రెస్ : పెరుమాండ్ల రామకృష్ణ
X

దిశ, హన్మకొండ : దేశవ్యాప్తంగా ప్రజాసంక్షేమం కోసం ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. ఆదివారం హన్మకొండ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని అబాసు పాలు చేయడానికే కొందరు బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

భూ కబ్జాలు చేసి జైలుకు వెళ్లిన అధికార పార్టీ కార్పొరేటర్ లు ప్రెస్ మీట్ లు పెట్టి నీతులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే అని దుయ్యబట్టారు. ఇప్పటికే కొన్ని కేసులు పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ ఉన్నవిషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి చిట్టా ఉందని సమయం వచ్చినప్పుడు ఆధారాలతో సహా బయట పెడతామని అన్నారు. ప్రజల సొమ్మును దోచుకొని దాచుకోవడం తప్ప అధికార పార్టీ చేసింది ఏమి లేదని ప్రతివిషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎదురు దాడి చేయడం సరికాదన్నారు.



Next Story

Most Viewed