కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి : యశస్విని రెడ్డి

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి : యశస్విని రెడ్డి
X

దిశ,రాయపర్తి : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల వలె కృషి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిండ్ల యశస్విని రెడ్డి కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని తిరుమలాయ పల్లి, సూర్య తండా, ఏకే తండా, పెరిక వేడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజారంజక పాలన నడుస్తుందన్నారు.

ప్రజలకు చేదోడు, వాదోడుగా ఉంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు అన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేక అదానీ అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మాచర్ల ప్రభాకర్, పెండ్లి మహేందర్ రెడ్డి, సాందీ కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed