- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రెయిన్ స్ట్రోక్ తో ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ మృతి
by velandi.Saikiran |
కేసముద్రం మండల పరిషత్ లో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న పన్నాటి సత్య ప్రకాష్(59) బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు

X
దిశ, కేసముద్రం: కేసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న పన్నాటి సత్య ప్రకాష్(59) బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు. సత్య ప్రకాష్ కు ఈ నెల 8న బ్రెయిన్ స్ట్రోక్ రాగా, ఆయనను హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించినట్లు ఎంపీడీవో కార్యాలయ అధికారులు తెలిపారు. సత్య ప్రకాష్ మృతదేహాన్ని హనుమకొండలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సత్య ప్రకాష్ మృతి పట్ల కేసముద్రం , మండల పరిషత్ అధికారులు, ఉద్యోగులు మాజీ జెడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి మాజీ ఎంపీపీ పొలం చంద్రమోహన్ ఎంపీటీసీలు సంతాపం తెలిపారు.
Next Story






