విద్యార్థుల‌తో క‌లిసి టిఫిన్ చేసిన రేవూరి ప్రకాశ్ రెడ్డి

by velandi.Saikiran |

విద్యార్థుల‌తో క‌లిసి రేవూరి ప్రకాశ్ రెడ్డి టిఫిన్ చేశారు.

విద్యార్థుల‌తో క‌లిసి టిఫిన్ చేసిన రేవూరి ప్రకాశ్ రెడ్డి
X

దిశ, ఆత్మకూర్: ప్రైవేటు మోజు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి. దామర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి అల్పాహార కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాల కన్నా ఉత్తీర్ణత శాతం స‌ర్కార్ బ‌డుల్లో పెరిగిందని వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు పాల్గొన్నారు.

Next Story