బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కడియం...

by Disha Web Desk 11 |
బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కడియం...
X

దిశ, హనుమకొండ టౌన్ : ఈ నెల 24న కాజీపేట మండలం మడికొండ ఈనాడు కార్యాలయం ఎదురుగా నిర్వహించనున్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ భారీ బహిరంగ సభ స్థలాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లపై చర్చించారు. సభ ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి లోటు పాట్లు లేకుండా, సభకు వచ్చే ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని నేతలకు సూచించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు భారీగా తరలి వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story