దళిత బంధు కావాలంటే.. డబుల్‌ ఇళ్లు అడగొద్దు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

by Disha Web Desk 13 |
దళిత బంధు కావాలంటే.. డబుల్‌ ఇళ్లు అడగొద్దు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
X

దిశ, హనుమకొండ టౌన్: దళిత బంధు ఇచ్చినోళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వమంటూ స్థానిక పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దళిత బంధు కావాలనుకున్న వారు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు అడగవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని కామారెడ్డి పల్లె గ్రామంలో ఆదివారం నూతనంగా రూ. 20 లక్షలతో నిర్మించే బడే మహిళా సమాఖ్య భవన శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

దళిత బంధు, డబుల్ బెడ్ రూం కొరకు దరఖాస్తు చేసుకున్న 12 మందిలో కేవలం 4 గురికి వస్తున్నాయన్నారు. నెల.. నెలకో.. నలుగురి చొప్పున మార్చిలోపు 12 మందికి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నా నియోజక వర్గానికి 1500 ఇచ్చినట్లే ఇచ్చి.. ఒక 500 మాత్రమే ఇచ్చారన్నారు. నా నియోజక వర్గంలో 20000 వేల కుటుంబాలున్నాయి.. మూడు పెద్ద కాలనీలు ఉన్నాయని.. వాటిలో దళిత ఓట్లు 8,000 ఉన్నాయన్నారు. అక్కడ 200 ఇచ్చినా సరిపోవడం లేదని తెలిపారు. ఉగాది లోపు 12 మంది ఇస్తాం అంటూ, తర్వాత ఒక్కొక్క నెల కొందరు కొందరు.. చొప్పున ఇచ్చుకుంటూ పొతామన్నారు. మీరేం గాబరా పడాల్సిన పని లేదన్నారు. కానీ, మీకు దళిత బంధు కావాలా, డబుల్ బెడ్ రూం కావాలో నిర్ణయించుకోండి అని సభా ముఖంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కొద్ది రోజుల్లో అధికారులు వస్తున్నారని, వారు రాక ముందే ఏది కావాలో నిర్ణయించుకుని చెప్పాలన్నారు.



Next Story

Most Viewed