బైక్ అదుపుతప్పి మైనర్ బాలుడు మృతి..

by Kodari Anjali |

ద్విచక్ర వాహన అదుపుతప్పి 14 ఏళ్ల బాలుడు మరణించిన ఘటన తుపాకులగూడెం మూల మలుపు వద్ద జరిగింది.

బైక్ అదుపుతప్పి మైనర్ బాలుడు మృతి..
X

దిశ, కన్నాయిగూడెం: వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చిన బాలుడు( 14)ద్విచక్ర వాహన అదుపుతప్పి మృతి చెందిన సంఘటన తుపాకులగూడెం మూల మలుపు వద్ద జరిగింది. స్థానిక ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన హర్ష వర్ధన్ (14) తన అమ్మమ్మ వాళ్ళ ఊరు తుపాకులగూడెం వెళ్లాడు. ద్విచక్ర వాహనం నేర్చుకునే ప్రయత్నంలో అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొనడంతో అక్కడే మృతి చెందాడని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్ట్ మార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకి మృతదేహాన్ని తరలించినట్టు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.

Next Story