మద్యం మత్తులో వ్యక్తి మృతి

by Bhanu |

కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంకు చెందిన చీకటి లోకేష్ అను వ్యక్తి భార్య గత పది సంవత్సరాల క్రితం కుటుంబ కలహాల కారణంగా వెళ్లిపోయింది.

మద్యం మత్తులో వ్యక్తి మృతి
X

దిశ, కేసముద్రం : కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంకు చెందిన చీకటి లోకేష్ అను వ్యక్తి భార్య గత పది సంవత్సరాల క్రితం కుటుంబ కలహాల కారణంగా వెళ్లిపోయింది. ఈ క్రమంలో లోకేష్ మద్యానికి బానిసైనాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ మద్యం సేవిస్తూ ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడు. మంగళవారం లోకేష్ ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. లోకేష్ గత రెండు , మూడు రోజుల క్రితం మద్యం తాగి తన ఇంట్లో పడుకొని చనిపోయి ఉంటాడు అని, మృతి పై ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి అన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది అని ఎస్ఐ మురళీధర్ రాజ్ తెలిపారు.


Next Story