చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య..

by Disha Web Desk 11 |
చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, పర్వతగిరి: ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వడ్లకొండ గ్రామానికి చెందిన నీలం సాయిలు(51)కు ఇద్దరు భార్యలు. వారిద్దరూ గతంలోనే చనిపోయారు. ఇద్దరు భార్యలకు చెరొక కొడుకు ఉండగా వారు కూడా వారి వారి అమ్మమ్మగారి ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో నీలం సాయిలు తన తల్లితో కలిసి గ్రామంలో జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే సాయిలో బాగా మద్యం తాగుడుకు బానిసయ్యాడు.

దీంతో పక్షవాతం, అనారోగ్య కారణాలవల్ల కొన్ని రోజులు హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నాడు. తన బాగోగులు ఎవరూ చూసుకునే వారు లేరని తీవ్ర మనస్థాపం చెందిన సాయిలు ఓ మామిడి తోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి నీలం కౌసల్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed