ప్రేమించింది ఒకరిని..పెండ్లి చేసుకున్నది మరొకరిని..చివరకి ఆ యువకుడు.

by Disha Web Desk 11 |
ప్రేమించింది ఒకరిని..పెండ్లి చేసుకున్నది మరొకరిని..చివరకి ఆ యువకుడు.
X

దిశ, దేవరుప్పుల(పాలకుర్తి): ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన యువకుడిని పోలీసులు 24 గంటల్లో అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపిన సంఘటన పాలకుర్తి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం పాలకుర్తి సీఐ విశ్వేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. లింగాలగణపురం మండలం చీటూరు గ్రామానికి చెందిన వాతల రీన, పాలకుర్తి మండలం శాతాపురం తండాకు చెందిన లాకవత్ మోహన్ (వినోద్) లు జనగామలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది.

ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి వినోద్ రీనను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ తరువాత గుట్టుచప్పుడు కాకుండా మరో యువతిని రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. హైదరాబాదులోని మియాపూర్ లో పనిచేస్తున్న రీన విషయం తెలుసుకొని హుటాహుటిన శాతాపురంలోని తండాలో వినోద్ ఇంటికి వెళ్లింది. రీనను వినోద్ తల్లిదండ్రులు, అక్క, బావలు కలిసి ఫోన్ లాక్కొని తీవ్రంగా కొట్టగా, రీన పాలకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది.

అనంతరం పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో వినోద్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటలలోపే ఎస్ఐ శ్రీకాంత్ లు తమ సిబ్బందితో కలిసి వినోద్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వినోద్ ను విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. ఈ మేరకు వినోద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

Next Story

Most Viewed