- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో త్రాగునీటి కొరత
by Ratna Kumari |
హనుమకొండ వడ్డేపల్లిలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో త్రాగునీరు లేక రిజిస్ట్రేషన్ పని కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్ : హనుమకొండ వడ్డేపల్లిలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో త్రాగునీరు లేక రిజిస్ట్రేషన్ పని కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ ఆవరణలో ఫ్రిడ్జి ఉన్నప్పటికీ నీరు పోయకపోవడంతో తుప్పు పట్టి వినియోగానికి పనికి రాకుండా పోయింది. రిజిస్ట్రేషన్ ల కోసం వచ్చే ప్రజలు బయట నుంచి వాటర్ బాటిల్లు కొనుక్కొని త్రాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ ల కోసం వేలాది రూపాయలు వసూలు చేసే అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయానికి వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
Next Story






