కేటీఆర్ సభను విజయవంతం చేయాలి – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Disha Web Desk 11 |
కేటీఆర్ సభను విజయవంతం చేయాలి – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ రాయపర్తి : రాష్ట్ర ఐటీ శాఖ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ఈనెల 9వ తేదీన తొర్రూర్ మండల కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా... బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఈ సభను విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలను కోరారు. శనివారం మండల కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తొర్రూర్ మండల కేంద్రంలో ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రానున్న సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని ఈ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేసి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పార్టీ కార్యకర్తలను ఎల్లప్పుడూ కాపాడుకుంటానని వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటానని అన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మూణావత్ నరసింహ నాయక్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్రావు, కార్యదర్శి పూస మధు, మండల కో ఆప్షన్ ఎండి అష్రఫ్, రాయపర్తి సర్పంచ్, గారి నరసయ్య, భువనగిరి, ఎల్లయ్య, ఉండాది సతీష్, వేముల రమేష్,ఎండి అన్వర్, మొర్రి రాజేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed