ములుగులో కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు భారీ షాక్

by Web Desk |
ములుగులో కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు భారీ షాక్
X

దిశ, ములుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. బీజేపీ మండల కార్యదర్శి గద్దల హరిబాబు ఆధ్వర్యంలో సోమవారం భారీగా బీజేపీలో చేరికలు జరిగాయి. బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొచ్చు నాగయ్య, మహ్మద్ లతీఫ్ ఖాన్, నూకల మహేష్, మల్లెల నరసింహులు, ఆలం శరత్, దబ్బకట్ల అనిల్, మహ్మద్ అక్బర్ షేక్, మెహబూబ్ ఖాన్, దబ్బకట్ల సమ్మయ్య, పాయం రాంమూర్తి, దబ్బకట్ల వెంకన్న, వినోద్, బొల్లికొండ వంశీ, రేగా రవి, తాటి సుధాకర్‌తో పాటు 50 మంది చేరారు. వీరికి గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతేగాక, మరికొంతమంది అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్, నాగూల్ మీరా, నాయకులు గోడిశాల ప్రకాశ్, మాదరి రమేష్, కాట శంకర్ కిసాన్, ఎల్కపెల్లి శ్రీనువాసు, యానాల చంద్రారెడ్డి, అందే రఘు, దబ్బకట్ల పాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story