నాపై చేసే అసత్య ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా : పోరిక బలరాం నాయక్

by Dishaweb |
నాపై చేసే అసత్య ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా : పోరిక బలరాం నాయక్
X

దిశ,మహబూబాబాద్ టౌన్: సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణ అర్బన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. తనపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ నాకే వచ్చిందని దురుద్దేశంతోనే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేసే నాయకులకు నేను సవాల్ విసురుతున్న నాపై చేసే ఆరోపణలు ఏ ఒక్క నాయకుడు నిరూపించిన నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. నికార్సైన కాంగ్రెస్ పార్టీ వాదినని, నా గెలుపును అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే టిఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఇలాంటి అసత్యపు ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ సహించదని, కాంగ్రెస్ కార్యకర్తలు ఇకనుండి ఇలాంటి విశ్వసనీయత లేని ఆరోపణలు తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అదేవిధంగా పార్టీ తీసుకునే నిర్ణయానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఒకవేళ ఎవరైనా టికెట్ తెచ్చుకున్నట్లైతే టికెట్ వచ్చిన వారికి తాను నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేది పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని మహబూబాబాద్ లో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన టువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, డిసిసి ఉపాధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story