Telangana Rains : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషితో హెలికాప్టర్‌లు

by Dishaweb |
Telangana Rains : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషితో హెలికాప్టర్‌లు
X

దిశ, కాటారం (భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్ పూర్ మండలం లో మోరంచ గ్రామంలో వరద ఉధృతిలో మునిగిపోయిన గ్రామ ప్రజలను హెలికాప్టర్ల సాయంతో రక్షించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ అధికారం కేంద్రంగంతో పాటు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డి లు బిజెపి జిల్లా అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను ప్రజల ఇబ్బందులను కీర్తి రెడ్డి కిషన్ రెడ్డికి ఫోన్లో వివరించారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం సాయి చర్యలు చేపట్టేందుకు కేంద్ర హోమ్ సెక్రెటరీ తో మాట్లాడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అధికారులతో మాట్లాడి కేంద్ర ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లను మోరంచకు పంపించినట్లు తద్వారా హెలికాప్టర్ల సాయంతో గ్రామ ప్రజలను రక్షించినట్లు చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి తెలిపారు. సాయంత్రానికి మోరంచ వద్ద వరద ప్రవాహం తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.


Next Story

Most Viewed