హాకా చైర్మన్ కు సన్మానం..

by Disha Web Desk 20 |
హాకా చైర్మన్ కు సన్మానం..
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర హాకా చైర్మన్ మచ్చా శ్రీనివాస్ ను జిల్లాలోని కేసముద్రం మండలంలో శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య యువజన జిల్లా అధ్యక్షుడుతో నుపుణురి సాయి కృష్ణ నివాసంలో తేనెటీ విందులో హాజరయ్యారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు గిరిగిరి వెంకన్న ఆధ్వర్యంలో సన్మానసభ నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డ్ లో జరిగిన మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటుగా ఆయన ప్రారంభించారు.

దన్నసరి సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో దన్నసరి క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచ్చా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పాలనదేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ సుహాసిని దుర్గేష్, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ గేల్లీ అర్చన రవి, ఎంపీపీ ఒలం చంద్ర మోహన్, మర్రి రంగా రావు, మాధారాపు సత్యనారాయణ రావు, మర్రి నారాయణ రావు, నజీర్ అహ్మద్, వీరు నాయక్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed