- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా హనుమాన్ శోభయాత్ర..
by Taduka Kalyani |
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఆయా ప్రాంతాల్లో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.

X
దిశ, ఖిలా వరంగల్: హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఆయా ప్రాంతాల్లో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీని రంగశాయిపేట, మహంకాళి ఆలయం వద్ద హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. వేల మంది హనుమాన్ భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. హన్మకొండలోని పద్మాక్షి ఆలయం సమీపంలో హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ కొనసాగింది.
ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీకి బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్భన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు హనుమాన్ పూజలో పాల్గొని, అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా దారి పొడవునా భజనలు, డప్పు వాయిద్యాలు, జై శ్రీరామ్ నినాదాలతో వీధులన్నీ మార్మోమోగాయి. భారీ ఎత్తున యువకులు బైక్లపై, కాషాయపు జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు.
Next Story






