జీఓ 59 స్థలాల రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయండి: కలెక్టర్ శశాంక

by Disha Web Desk 11 |
జీఓ 59 స్థలాల రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయండి: కలెక్టర్ శశాంక
X

దిశ, మహబూబాబాద్ టౌన్: జీఓ 59 స్థలాల రిజిస్ట్రేషన్ లు వేగవంతంగా చేయించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో జీఓ 59 ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ లు వేగవంతం విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 59 జీఓ రిజిస్ట్రేషన్లలో ఎటువంటి అపోహలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

స్థలాల రిజిస్ట్రేషన్ లపై ప్రజాప్రతినిధులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా తెలియజేస్తూ వేగవంతంగా రిజిస్ట్రేషన్లు జరిపేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తాసిల్దార్ నాగ భవాని తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed