మానసిక వేదనతో ఉరి వేసుకొని వ్యక్తి మృతి

by Bhanu |   (  Updated:2025-06-05 10:40:46  IST  )

గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

మానసిక వేదనతో ఉరి వేసుకొని వ్యక్తి మృతి
X

దిశ, గన్నేరువరం : గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్ల పెళ్లి పరుశరాములు (80) గురువారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఒంటరిగా జీవిస్తూ మానసిక వేదనకు లోనైన పరశురాములు, ఈ కారణంగానే ఘటనకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కోడలు అరుణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై తాండ్ర నరేష్ దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.




Next Story