ప్రజల మేలు కోసమే అభివృద్ధి: జడ్పీ చైర్మన్ పుట్ట మధు

by Disha Web Desk 11 |
ప్రజల మేలు కోసమే అభివృద్ధి: జడ్పీ చైర్మన్ పుట్ట మధు
X

దిశ, కాటారం: ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేశానని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంచార్జి, జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. గురువారం రేగుల గూడెం ఎంపీటీసీ బండం రాజమణి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సుమారు 80 మందిని బీఆర్ఎస్ లోకి పుట్ట మధు కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం తారం మండలంలోని దేవరాంపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచి పాలకుల కోసమే రాజ్యాంగం ఓటు హక్కు కల్పించారని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించి వేయాలన్నారు.

మార్పులో దేవరాంపల్లి యువత ఆదర్శంగా నిలువాలని సూచించారు. 2014లో కాటారం మండలం తనకు మెజారిటీ ఇవ్వకపోయినా ఈ ప్రాంత ప్రజల మేలు కోరి అనేక అభివృద్ది పనులు చేశామని అన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి జడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు తోట జనార్ధన్, ఎంపీటీసీ బండం రాజమణి, రైతు బంధు అధ్యక్షుడు కుడుదుల రాజ బాపు, నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు బూపెల్లి రాజు, సబ్ డివిజన్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జి వంగల రాజేంద్ర చారి, మహిళ అధ్యక్షురాలు ఎలుబాక సుజాత, ఎస్సీ సెల్ నియోజక వర్గ అధ్యక్షుడు పంతకాని సడవలి, ఎంపీటీసీ బాసాని రవి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed