విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి

by velandi.Saikiran |

విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి చెందిన సంఘటన మండలంలోని ముల్కనూరు గ్రామపంచాయతీ దుబ్బగూడెంలో బుధవారం

విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి
X

దిశ, గార్ల: విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి చెందిన సంఘటన మండలంలోని ముల్కనూరు గ్రామపంచాయతీ దుబ్బగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత రైతు యలమంచిలి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, పాడిగేదెను రోజు లాగానే గడ్డి మెసేందుకు వెళ్లిన‌ట్లు పేర్కొన్నారు. అయితే, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి 30 వేల రూపాయల విలువైన పాడిగేదె మృతి చెందినట్లు తెలిపారు. అధికారులు స్పందించి నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు.

Next Story