కాంగ్రెస్ నాయకుల విగ్రహాల ముసుగు తొలగించిన నాయకులు

by Disha Web Desk 20 |
కాంగ్రెస్ నాయకుల విగ్రహాల ముసుగు తొలగించిన నాయకులు
X

దిశ, బయ్యారం : మండలంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావలి ప్రకారం, పార్టీ విగ్రహాలకు, దిమ్మెలకు మండల అధికారులు ముసుగులు వేశారు. ఎన్నికల కోడ్ సమయం ముగిసిన సందర్భంగా, శుక్రవారం బయ్యారం బస్టాండ్ సెంటర్ నందు గల మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, విగ్రహలకు ముసుకులను కాంగ్రెస్ పార్టీ బయ్యారం టౌన్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తొలగించి, నీటితో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, వాటిని తొలగించక పోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గౌరిశెట్టి వెంకన్న, బాలాజీపేట కాంగ్రెస్ నాయకులు చిలక రాములు, తునికిపాటి నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed