నేడు భూపాల‌ప‌ల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న

by Ratna Kumari |   (  Updated:2026-02-08 10:45:23  IST  )

భూపాలపల్లి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.

నేడు భూపాల‌ప‌ల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న
X

దిశ, వరంగల్ బ్యూరో : భూపాలపల్లి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరి 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచ కు చేరుకుంటారు. అక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు చేరుకుంటారు. స్వామి వారిని దర్శించుకొని అక్కడ జరిగే పనులు పరిశీలిస్తారు. నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్ ను సీఎం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఘనపూర్ మండలం చెల్పూర్ గ్రామం కు సీఎం మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. చెల్పూర్ గ్రామం లో ప్రజా పాలనV ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ కు హెలికాప్టర్ ద్వారా వెళ్లారు. చెల్పూర్ లో జరిగే సభకు భారీ ఏర్పాట్లు చేశారు.

యాసంగి రైతు భరోసా కోసం ప్రభుత్వం కసరత్తు.. రెండ్రోజుల్లో డబ్బులు?

Next Story