కడియం పుట్టిన రోజు.. వృద్ధులకు పండ్ల పంపిణీ

by velandi.Saikiran |

కడియం జన్మదిన వేడుకలను మండల పార్టీ అధ్యక్షుడు పెసరు రమేష్ నిర్వహించారు.

కడియం పుట్టిన రోజు.. వృద్ధులకు పండ్ల పంపిణీ
X

దిశ, ధర్మసాగర్: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి జన్మదిన వేడుకలను ధర్మసాగర్ లో సేవా కార్యక్రమాలతో మండల పార్టీ అధ్యక్షుడు పెసరు రమేష్ ఘనంగా నిర్వహించారు. కడియం శ్రీహరి చిత్ర పటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి ఏలీయా, జిల్లా ఉపధ్యక్షుడు ప్రసాద్,మాజీ జడ్పిటిసి శ్రీలత సత్యనారాయణ, మాజీ సర్పంచ్ శరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story