బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి.. బీఎస్పీ నాయకుల డిమాండ్

by Dishafeatures2 |
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి.. బీఎస్పీ నాయకుల డిమాండ్
X

దిశ, భీమదేవరపల్లి: బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని ములుకనూరులో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నడిగోట నరేష్ మాట్లాడుతూ.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. నూటికి 70 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు దేనికి సరిపోతాయని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తక్కువగా ఉండటం వల్ల విద్య, ఉపాధి రంగాల్లో బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా ప్రజలు తమ కార్యక్రమానికి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు గడిపె చంటి, నాయకుల తాడూరి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed