వాహన తనిఖీల్లో లక్ష 21 వేల నగదు సీజ్

by Disha Web Desk 15 |
వాహన తనిఖీల్లో లక్ష 21 వేల నగదు సీజ్
X

దిశ, చేర్యాల : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాల మండల పరిధిలోని ముస్త్యాల వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా గట్టు విజయ్ అనే వ్యక్తి తన కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న లక్ష 21 వేల 200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చేర్యాల సీఐ శ్రీను, ఎస్సై దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఎన్నిక నియమావళి అమల్లో ఉన్నదని, 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలు దగ్గర ఉండాలని, ఇప్పటి వరకు స్వాధీన చేసుకున్న సొమ్మును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ సెల్ లో డిపాజిట్ చేసినట్టు తెలిపారు. సంబంధిత బాధితులు సరియైన ఆధారాలు తీసుకొని వెళ్లి డబ్బులు రిలీజ్ చేసుకోవాలని సూచించారు.



Next Story

Most Viewed