- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలను కాపాడిన బాలుడు
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. అయితే, ఈ భారీ అగ్ని ప్రమాద సమయంలో ఓ బాలుడి సాహసం 50 మంది ప్రాణాలను కాపాడింది. స్థానికంగా నివసించే సాయిచరణ్ అనే ఓ బాలుడు భవనంలో చెలరేగిన మంటలను గుర్తించి వెంటనే భవనం పైకెక్కి తాడు కట్టాడు. ఈ తాడు సాయంతో భవనంలో ఉన్న కార్మికులు కిందకు దిగారు. లేకపోతే వారంతా అక్కడికక్కడే సజీవదహనమయ్యేవారు. 50 మంది సురక్షితంగా బయటపడటంతో జనాలు ఈ పిల్లాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బిల్డింగ్లో మంటలు చెలరేగడానికి కారణం వెల్డింగ్ పనులేనని పోలీసలు గుర్తించారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story