జనగామ జిల్లాలో ఆటోొ డ్రైవర్ ఆత్మహత్య

by Disha Web Desk 16 |
జనగామ జిల్లాలో ఆటోొ డ్రైవర్ ఆత్మహత్య
X

దిశ, రఘునాథపల్లి: రఘునాథపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కడారి నరసింహులు (35) నిడిగొండ బ్రిడ్జి సమీపంలోని మామిడి తోటలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నరసింహులు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.


Next Story

Most Viewed