- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మిర్చి మిల్లులో యంత్రం విడిభాగం మీద పడి మహిళ దుర్మరణం..
దిశ, వరంగల్ టౌన్: మిర్చి మిల్లులో కూలీగా పని చేస్తున్న ఓ మహిళపై యంత్రం విడి భాగం పడడంతో దుర్మరణం చెందిన సంఘటన ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ మహేందర్ కథనం ప్రకారం.. శివనగర్కు చెందిన ప్రతాపగిరి కవిత (29) కొత్తపేట ప్రాంతంలోని జ్యోతి ఇండస్ట్రీస్లో కారం పొడి మిల్లులో పని చేస్తోంది. సోమవారం కూడా పనికి వెళ్లగా మిల్లులో ఓ యంత్రం రిపేర్ కు వచ్చింది. యంత్రానికి ఓ విడి భాగాన్ని బిగించేందుకు 150 కిలోల బరువు గల పరికరాన్ని పైకి ఎత్తి పట్టుకోవాలని రిపేరర్ చెప్పాడు.
కవితతో పాటు మరో ముగ్గురు ఆ పరికరాన్ని పైకి ఎత్తి పట్టుకున్న క్రమంలో బరువు ఆపలేక వదిలేయడంతో మధ్యలో ఉన్న కవితపై ఆ పరికరం పడింది. దీంతో ఆమె చాతి భాగంలో బలంగా దెబ్బతగిలినట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను వరంగల్లోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స అందిస్తుండగానే మరణించింది. మృతుడి భర్త వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏనుమాముల సీఐ మహేందర్ వివరించారు. కాగా, మృతురాలికి కొడుకు ఉదయ్ కిరణ్, కూతురు సమిత ఉన్నారు. మిల్లు యాజమాని నిర్లక్ష్యం కారణంగానే కవిత మృతి చెందిందని తోటి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.