డాక్టర్ల నిర్లక్ష్యంతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

by Dishanational2 |
డాక్టర్ల నిర్లక్ష్యంతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
X

దిశ, హనుమకొండ టౌన్ : చికిత్స పొందుతూ భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ముక్కులో మాంసం పెరగడంతో హనుమకొండలోని రాజు ఆస్పత్రిలో అడ్మిట్ అయిన లక్ష్మణ్, ఆపరేషన్ చేసే క్రమంలో అనస్థీషియా ఇవ్వగానే విషమించిన ఆరోగ్యం , సీరియస్ కావడంతో వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో అతన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ లక్ష్మణ్ మృతి చెందాడు. అనస్థీషియా డాక్టర్ నిర్లక్ష్యంతోనే లక్ష్మణ్ మృతిచెందాడని ఆస్పత్రి ముందు డెడ్ బాడీతో మృతుని బంధువుల ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed