గాంధీ వర్థంతి సందర్భంగా హన్మకొండలో 2కే రన్

by Dishafeatures2 |
గాంధీ వర్థంతి సందర్భంగా హన్మకొండలో 2కే రన్
X

దిశ కేయూ క్యాంపస్ : జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 2 K-రన్ (శాంతిపరుగు)కు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ (ముల్టిపుల్) దాచేపల్లి సీతారాం ముఖ్య అతిదిగా హాజరయ్యారు. జిల్లా వాసవి క్లబ్ రీజియన్ 4-రీజియన్ చైర్మన్ డా.వల్ల్లాల పృథ్వీరాజ్ సారధ్యం లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి కాముక దేశం భారతదేశం అన్నారు. జాతిపిత అవలంభించిన సత్యం, అహింస అనే సిద్ధాంతంతోనే ఏదైనా సాధ్యం అన్నారు. రీజియన్ చైర్మన్ డా.వల్ల్లాల పృథ్వీరాజ్ జెండా ఊపిన అనంతరం, వరంగల్ చౌరస్తా నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు నిర్వహించిన 2 K-రన్ (శాంతిపరుగు) కు మంచి స్పందన లభించింది. 20 మంది మునిసిపల్ కార్మికులకు బ్లాంకెట్ లు పంచారు. ఈ 2 K-రన్ (శాంతిపరుగు) మరియు సేవా కార్యక్రమం లో రీజియన్ లోని వాసవి క్లబ్ వరంగల్, వాసవి క్లబ్ అభ్యుదయ, వాసవి క్లబ్ ప్రతాపరుద్ర, వాసవి క్లబ్ డాక్టర్స్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed