సాయంత్రం 5 గంటల తర్వాత లోపలికి అనుమతించరు.. కానీ ఓటు వేయవచ్చు..!

by Bhoopathi Nagaiah |

తెలంగాణలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తుతున్నారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 11 గంటల తర్వాత ఊపందుకుంది.

సాయంత్రం 5 గంటల తర్వాత లోపలికి అనుమతించరు.. కానీ ఓటు వేయవచ్చు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తుతున్నారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 11 గంటల తర్వాత ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. 5 గంటల తర్వాత ఏ ఒక్కరినీ లోపలికి అనుమతించరు.

అయితే 5 గంటల తర్వాత కూడా ఓటేయ్యవచ్చని చెబుతున్నారు ఎన్నికల అధికారులు. అది ఎలా అంటే పోలింగ్ కేంద్రాల్లోకి సాయంత్రం 5 గంటల వరకే ఎంట్రీ ఉన్నప్పటికీ ఆ సమయం లోపు సెంటర్ లోపలికి వెళ్లిన వారికి అవకాశం ఉంటుంది. పదులు, వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నా ఎన్నికల అధికారులు ఓటు వేసే అవకాశం ఇస్తారు. కానీ 5 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించరు. ఈ విషయాన్ని ఓటర్లు గ్రహించి పోలింగ్ సమయంలోపు కేంద్రాలకు రావాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు.

Next Story