35 ఏళ్ల తర్వాత ఒకేరోజున నిమజ్జనం.. మిలాద్-​ఉల్​-నబీ ఊరేగింపు.. హైదరాబాద్ పోలీసులకు సవాల్..!

by Disha Web Desk 19 |
35 ఏళ్ల తర్వాత ఒకేరోజున నిమజ్జనం.. మిలాద్-​ఉల్​-నబీ ఊరేగింపు.. హైదరాబాద్ పోలీసులకు సవాల్..!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు లక్షలాది మంది భక్తుల పూజలు అందుకోనున్న బొజ్జ గణపయ్య నిమజ్జన శోభాయాత్ర ఈనెల 28న జరుగనుంది. ప్రస్తుతం ఇదే హైదరాబాద్​సిటీ పోలీసుల్లో టెన్షన్​సృష్టిస్తోంది. కారణం అదే రోజున మిలాద్​ఉల్​నబీ ఊరేగింపు జరగనుండటం.

ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు శోభాయాత్ర.. మిలాద్​ఉల్​నబీ ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. ఈ క్రమంలోనే సున్నితమైనవిగా గుర్తించిన పోలీస్​స్టేషన్లకు తాత్కాలిక పద్దతిపై అదనంగా ఇన్స్​పెక్టర్లను పంపిస్తూ హైదరాబాద్​సీపీ సీ.వీ.ఆనంద్​ఉత్తర్వులు జారీ చేశారు.

లక్షకు పైగా విగ్రహాల ప్రతిష్టాపన..

ఈసారి హైదరాబాద్​కమిషనరేట్​పరిధిలో లక్షకు పైగా విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుందన్నది పోలీసుల అంచనా. వీటిలో కొన్ని విగ్రహాల నిమజ్జనం చవితి వేడుకలు ప్రారంభమైన మూడు, అయిదు, తొమ్మిదో రోజున జరుగుతాయి. మిగిలిన విగ్రహాల నిమజ్జనం శోభాయాత్ర రోజున జరుగుతుంది. ఈ శోభాయాత్రలో నగరం నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారు.

35 ఏళ్ల తరువాత..

ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సంవత్సరం శోభాయాత్ర రోజునే మిలాద్​ఉల్​నబీ ఊరేగింపు రావటం పోలీసుల్లో కలవరాన్ని కలిగిస్తోంది. ఇలా రెండు ఊరేగింపులు ఒకే రోజున రావటం 35 సంవత్సరాల తర్వాత అని చెప్పిన ఓ సీనియర్​పోలీసు అధికారి.. ఈసారి బందోబస్తు మాకు కత్తి మీద సామే అని వ్యాఖ్యానించారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా అది పెద్దదయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ క్రమంలోనే శాంతిభద్రతల పరిరక్షణకు ఈ సంవత్సరం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

ఇందులో భాగంగానే ఇటీవల ఇరు వర్గాలకు చెందిన పెద్దలతో పోలీస్​కమిషనర్​సీ.వీ.ఆనంద్​సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో మిలాద్​ఉల్​నబీ ఊరేగింపును మరో రోజుకు వాయిదా వేయటానికి ముస్లిం పెద్దలు అంగీకారాన్ని తెలిపినట్టు పేర్కొన్నారు. అయితే, దీనిని కొందరు అంగీకరించటం లేదన్నారు. ఈ క్రమంలో రెండు ఊరేగింపులు ఒకే రోజు జరుగుతాయని భావిస్తూ బందోబస్తు స్కీములు తయారు చేస్తున్నట్టు వివరించారు.

అదనంగా సీఐలు..

శోభాయాత్ర రోజున సిటీ పోలీసులకు తోడుగా పదిహేను వేలమందికి పైగా అదనపు బలగాలు రానున్నట్టు ఆ అధికారి చెప్పారు. చవితి వేడుకలు జరిగే అన్ని రోజులు ప్రతీ మండపం వద్ద పోలీస్​పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దాంతోపాటు రౌడీషీటర్లు, ఇతర అసాంఘిక శక్తులపై పటిష్టమైన నిఘా పెట్టినట్టు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నట్టు వివరించారు.

ఈ క్రమంలోనే సీ కేటగిరీలో ఉన్న ఇరవై రెండు పోలీస్​స్టేషన్లకు అదనంగా ఇన్స్​పెక్టర్లు అవసరం అన్న అంశం తమ దృష్టికి వచ్చినట్టు చెప్పారు. అందుకే హైదరాబాద్​సిటీ పోలీస్‌లోని వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్న 22మంది ఇన్స్​పెక్టర్లను ఈ పోలీస్​స్టేషన్లకు అదనంగా పంపిస్తూ పోలీస్​కమిషనర్​ఆనంద్​ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు.

Next Story

Most Viewed