పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

by Disha Web Desk 2 |
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తాను పార్టీని వీడటం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఆమె చెక్ పెట్టారు. తాను పార్టీని వీడటం లేదని.. బీజేపీలోనే ఉంటానని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. రెండ్రోజులుగా బీజేపీతో దూరంగా ఉన్నారని, పార్టీతో అభిప్రాయభేదాలు ఉన్నాయని సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని, ఇది సరైనదో కాదో ప్రచారం చేసే వారికే తెలియాలని, తానైతే మహాశివుని కాశీ మహాపుణ్యక్షేత్రం, గరళకంఠుని సన్నిధానానికి, ఇతర రాష్ట్రాల్లోని ఆలయాలను సందర్శిస్తున్నట్లు సోషల్ మీడియాలో విజయశాంతి పోస్ట్ చేశారు. దీంతో ఆమె పార్టీని వీడటం లేదనే అంశానికి చెక్ పడినట్లయింది.



Next Story

Most Viewed