కోలుకో మిత్రమా.. డీఎస్‌కు వీహెచ్ పరామర్శ

by Disha Web Desk 12 |
కోలుకో మిత్రమా.. డీఎస్‌కు వీహెచ్ పరామర్శ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర అనారోగ్యంతో బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పరామర్శించారు. బుధవారం ఆసుపత్రికి వెళ్లిన వీహెచ్ శ్రీనివాస్ తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గతంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో పీసీసీగా, మాజీ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాలతో డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు.

అక్కడ కేసీఆర్ తో విభేదాల కారణంగా తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో డీఎస్ ఓ సారి సోనియా గాంధీని సైతం కలిసి వచ్చారు. డీఎస్ తిరిగి పార్టీలోకి వస్తారనే టాక్ పై అప్పట్లో స్పందించిన వీహెచ్.. శ్రీనివాస్ ఒక్కడే కాంగ్రెస్‌లోకి రావొద్దని తన కుమారుడిని కూడా పార్టీలోకి తీసుకురావాలనే షరతు పెట్టారు. రాజకీయంగా వీరిద్దరి మధ్య ఎలా ఉన్నా వాటిని పక్కన పెట్టిన హనుమంతరావు డీఎస్‌ను పరామర్శించారు.


Next Story

Most Viewed