కడప అమ్మాయి.. షర్మిలకు తెలంగాణలో ఏం పని..? వీహెచ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
కడప అమ్మాయి.. షర్మిలకు తెలంగాణలో ఏం పని..? వీహెచ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. కడప అమ్మాయి.. అక్కడ తిరిగితేనే ప్రయోజనం ఉంటుందని హితవు పలికారు. షర్మిల చెప్పుకునే వైఎస్ కూడా మా నాయకుడే అన్ని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన వీహెచ్.. పార్టీని తిట్టిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవద్దని అన్నారు.

పార్టీలో చేరికలపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నమ్ముకుని ఉన్న నేతలకు అన్యాయం చేయవద్దన్నారు. తెలంగాణలో పొత్తులు లేవని ఎప్పుడో చెప్పడం జరిగిందని.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను తీవ్రంగా దూషించారని ఆయన లాంటి నేతలు వస్తే పార్టీలోకి తీసుకోవద్దన్నారు.

Also Read..

మీ స్పందన కావాలి.. కామెంట్లు పెట్టండి: షర్మిల


Next Story

Most Viewed