వానాకాలం పంటలకు నీటి విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Ajay Maddhiboyina |

వానాకాలం పంట‌ల‌కు నీటి విడుద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. నేడు స‌చివాల‌యంలో మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నీటి పారుద‌ల శాఖ అధికారుల‌తో ప్ర‌త్యేక స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు.

వానాకాలం పంటలకు నీటి విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: వానాకాలం పంట‌ల‌కు నీటి విడుద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. నేడు స‌చివాల‌యంలో మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నీటి పారుద‌ల శాఖ అధికారుల‌తో ప్ర‌త్యేక స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఆయ‌న అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. సాగునీటి అంశంలో రైతాంగం ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని చెప్పారు. వ‌ర్షాల తీవ్ర‌త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించాల‌ని అధికారుల‌కు సూచించారు. వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో నీటి పారుద‌ల శాఖ అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని చెప్పారు. వానాకాలం పంట‌ల‌కు స‌మృద్ధిగా నీటిని అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు.

Next Story