- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బియ్యంపై ఫిలిప్పీన్స్ మంత్రి ప్రశంసలు
ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో లారెన్ జూనియర్తో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బియ్యం నాణ్యతపై మంత్రులు చర్చించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో లారెన్ జూనియర్తో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బియ్యం నాణ్యతపై మంత్రులు చర్చించారు. ఫిలిప్పీన్స్కు బియ్యం, వరి ఎగుమతుల పరిధిని విస్తరించడంపై చర్చించారు. రాబోయే సంవత్సరంలో తమ దేశానికి బియ్యం, వరి దాదాపు 2 ఎంఎంటీ ఉండవచ్చని ఫ్రాన్సిస్కో అన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... ఫిలిప్పీన్స్ కు పెద్దఎత్తున బియ్యం ఎగుమితి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రిని తెలంగాణకు ఆహ్వానించినట్టు వెల్లడించారు. తెలంగాణ బియ్యం మంచి నాణ్యతతో ఉన్నాయని ఆయన చెప్పారన్నారు. తెలంగాణ బియ్యం నాణ్యతను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






