ప్రభుత్వం, వ్యాపారులే కాదు.. పట్టాలు కూడా రైతులకు హ్యాడించాయ్! (వీడియో)

by Disha Web Desk 12 |
ప్రభుత్వం, వ్యాపారులే కాదు.. పట్టాలు కూడా రైతులకు హ్యాడించాయ్! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆకాల వర్షాలు తెలంగాణ రైతులను ఆగం ఆగం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట కొన్ని గంటల్లో అమ్ముడు పోతుందనే సమయంలో భారీ వర్షం వచ్చి రైతులకు కన్నీరు మిగిల్చింది. ఈ అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా జిల్లాలో పంట నీటి పాలైంది. అలాగే ఇదురు గాలుల వల్ల మామిడి, జామ, మక్క, మిరప వంటి పంటలు నేల రాలాయి. అయితే ప్రస్తుతం ఓ ప్రాంతంలోని రైతులు కుప్పలుగా పోసిన ధాన్యం వద్ద ఈదురుగాలులు సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రైతులు పడే వేదన ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణగా ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. కాగా ఆ వీడియోలో రైతులు వరి కుప్పల‌పై వర్షం నుంచి తమ ధాన్యాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసిన పట్టాలు భారీ ఈదురు గాలులకు పైకి ఎగిసిపడటం కనిపించింది. అలాగే ఆ పట్టాలు ఆకాశంలోకి అమాంతం ఎగిరిపోవడం కూడా ఈ వీడియో లో స్పష్టంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఈదురు గాలుల కారణంగా ఆగం అవుతున్న రైతులు చూసి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు.

భారీ ఈదురు గాలులకు గాల్లోకి ఎగిసిపడిని పట్టాలు (వీడియో)



Next Story

Most Viewed