- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Davos: దావోస్లోని తెలంగాణ పెవీలియన్లో కేంద్ర మంత్రుల సందడి
స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 55 వ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పెవీలియన్ ప్రారంభించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దావోస్లోని (Telangana Pavilion in Davos) తెలంగాణ పెవీలియన్లో సందడి నెలకొంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో (World Economic Forum) వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 55 వ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth) తెలంగాణ పెవీలియన్ ప్రారంభించిన తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. యూనియన్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ చిరాగ్ పాశ్వాన్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేరళ రాష్ట్ర పరిశ్రమలు, న్యాయ శాఖ మంత్రి పి. రాజీవ్ సీఎంతో ముచ్చటించారు.
తెలంగాణ రైజింగ్ నినాదంతో రెండో రోజు అనేక ఉత్తేజకరమైన, పెట్టుబడులకు ఆశాజనకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి తెలంగాణ పెవీలియన్లో యునిలివర్ ఇన్కార్పొరేషన్ (భారత్లో హిందుస్తాన్ లీవర్) గ్లోబల్ సీఈవో హయన్ షూమాకర్ తో సమావేశం జరగనుంది. అలాగే గ్లోబల్ పబ్లిక్ పాలసీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్, సిఫీ టెక్నాలజీస్, స్కైరూట్ ఎయిరోస్పేస్, ఎజిలిటీ, యూపీఎల్ వంటి అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశాలు, చర్చలు ప్రారంభం కానున్నాయి. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సారధ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరపనుంది.






