అందుబాటులోకి బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్!

by Ajay Maddhiboyina |

లింగంపల్లి బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, మేయర్ విజయలక్ష్మి, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్ మరియు ఈటల రాజేందర్, రఘునందన్ రావు హాజరయ్యారు.

అందుబాటులోకి బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్!
X

దిశ, వెబ్ డెస్క్: లింగంపల్లి బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, మేయర్ విజయలక్ష్మి, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్ మరియు ఈటల రాజేందర్, రఘునందన్ రావు హాజరయ్యారు. రూ.172 కోట్లతో 6 లేన్లుగా 1.6 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 2022లోనే ఈ ఫ్లైఓవర్ పనులను ప్రారంభించగా జాప్యం జరగడంతో ఆలస్యం అయ్యింది. ఫ్లైఓవర్ నిర్మాణంతో సంగారెడ్డిలోని పలు ప్రాంతాల నుండి పటాన్ చెరు ద్వారా బీరంగుడ మీదుగా లింగంపల్లి ఫ్లైఓవర్ ఎక్కి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ చేరుకుంటారు.

Next Story