రైతులకు బిగ్ రిలీఫ్... యూరియా సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు

by velandi.Saikiran |   (  Updated:2025-07-09 09:42:00  IST  )

రైతులకు బిగ్ రిలీఫ్... యూరియా సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా (Union Minister JP Nadda). అవసరాలకు అనుగుణంగా యూరియా ( Urea) సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎరువుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2023- 24 రబీతో పోలిస్తే 2024- 25లో 21% అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు.

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 12.4% అదనపు వినియోగం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సమన్వయాన్ని చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని సూచనలు చేశారు జేపీ నడ్డా. దింతో తెలంగాణ రాష్ట్ర రైతులకు ఊరట లభించింది.

Next Story