- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాదరణను ఓర్వలేక పిచ్చిరాతలు : ఎంపీ ‘చామల’ ఫైర్
by Muthe.Rajitha |
కాంగ్రెస్ప్రభుత్వం ప్రజలు చూపిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే పిచ్చిరాతలు రాయిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ప్రభుత్వం ప్రజలు చూపిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే పిచ్చిరాతలు రాయిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, దాంతో ఆయన ప్రత్యేక విమానం కొనుగోలు చేస్తున్నారని, దీనికోసం కమిటీ కూడా వేసాడని ఒక పత్రికల్లో ప్రచురించడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి స్పందించారు. ఈమేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... చెత్త న్యూస్ రాయించి, ప్రజలను తప్పుదోవ పట్టించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి పిచ్చి రాతలు రాయించి రాక్షసానందాన్ని పొందుతుందని ఎంపీ దుయ్యబట్టారు.
Next Story






