- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెట్రో పిల్లర్ను ఢీ కొట్టిన టూ వీలర్.. ఇద్దరు స్పాట్ డెడ్
హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. టూ వీలర్ అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతులను మధు, హరీశ్ లుగా గుర్తించారు. ఆ సమయంలో వారిద్దరూ తాగి ఉన్నారా? అందుకే ఈ ప్రమాదం జరిగిందా? అన్న విషయం పోస్టుమార్టంలో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Next Story






