TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

by Disha Web Desk 2 |
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిచ్చిన సమాచారంతో ప్రశ్నపత్రాలు ఇంకెవరెవరి చేతికి వెళ్లాలనే దానిపై కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్‌కు చెందిన మైసయ్య, జనార్ధన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు డాక్యా నాయక్ నుంచి రూ.2 లక్షలకు ఏఈ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య 19కి చేరింది.


Next Story

Most Viewed