ట్విట్టర్‌లో కేసీఆర్ ఫస్ట్ పోస్ట్.. వింటేజ్ లుక్ ఫొటో షేర్ చేసిన గులాబీ బాస్..!

by Disha Web Desk 19 |
ట్విట్టర్‌లో కేసీఆర్ ఫస్ట్ పోస్ట్.. వింటేజ్ లుక్ ఫొటో షేర్ చేసిన గులాబీ బాస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ప్రముఖ ఫ్లాట్‌ఫామ్స్ ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్‌స్టా గ్రామ్‌లలో గులాబీ బాస్ అకౌంట్లు ఓపెన్ చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఎక్స్ (ట్విట్టర్)లో తొలి పోస్ట్ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..!’’ అని కేసీఆర్ తన ఎక్స్ ఖాతాలో తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వింటేజ్ లుక్‌లో ఉన్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఫొటో యాడ్ చేశారు.

కాగా, ప్రస్తుతం రాజకీయ నాయకులు, సెలబ్రెటీల తమకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తున్నారు. పొలిటిషియన్స్ మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియా వేదికగానే ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోవత్సం రోజే కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టడం గమనార్హం. ఇక, కేసీఆర్ సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేసిన నిమిషాల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగారు. దీంతో ‘అది కేసీఆర్ రేంజ్’ అంటూ గులాబీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Click Here For Twitter Post..



Next Story

Most Viewed