TS : అయోధ్య వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు

by Sathputhe Rajesh |

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతున్న రాష్ట్ర ప్రజలకు వేళ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

TS : అయోధ్య వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతున్న రాష్ట్ర ప్రజలకు వేళ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యకు వెళ్లే వారి కోసం స్పెషల్ ట్రైన్ నడపనుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు ఫెసిలిటీ కల్పిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని యశ్వంత్ పూర్ - గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్‌ను నడపనున్నారు. శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ట్రైన్ కాచిగూడ నుంచి బయలు దేరనుంది. శనివారం సాయంత్రం 4.25 గంటలకు అయోధ్య రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

Next Story