TRT నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలి: డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్

by Disha Web Desk 19 |
TRT నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలి: డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15 వేల ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి, వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించి 9 నెలలు గడిచినా టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయకుండా టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ అంటూ కాలయాపన చేయడం సరికాదని పేర్కొంది. హైకోర్టులో బదిలీల పదోన్నతుల ప్రక్రియపై ఒక పక్క కేసులు ఉండగా.. ఆ ప్రక్రియ పూర్తి అయ్యే సరికి జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపింది.

Next Story

Most Viewed