మునుగోడు అభివృద్ధి జరిగింది ఆ సమయంలోనే: కూసుకుంట్ల

by Disha Web Desk 2 |
మునుగోడు అభివృద్ధి జరిగింది ఆ సమయంలోనే: కూసుకుంట్ల
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్‌కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచారం రంజుగా మారింది. తాజాగా.. బైపోల్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2018 వరకే అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే డిండి ఎత్తిపోతలతో పాటు రూ.600 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు మరమ్మతులు చేశామని అన్నారు. ఫ్లోరైడ్ రక్కసిని పారద్రోలడానికి మిషన్ భగీరథ పథకాన్ని మునుగోడు నుంచే ప్రారంభించామని తెలిపారు. 2018 ఎన్నికల్లో గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. పూటకో మాట మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేశారని ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీకి మూడో స్థానం ఖరారైపోయిందని జోస్యం చెప్పారు.



Next Story